సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి : డీఎంవో తుకారాం రాథోడ్

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి : డీఎంవో తుకారాం రాథోడ్
  • డీఎంవో తుకారాం రాథోడ్

ఆర్మూర్​, వెలుగు : సీజనల్ వ్యాధులు రాకుండా  చర్యలు తీసుకోవాలని డీఎంవో తుకారాం రాథోడ్​ సూచించారు. ఆర్మూర్​లోని ఏరియా హాస్పిటల్​లో శుక్రవారం మలేరియా, డెంగ్యూ వ్యాధుల నివారణ కోసం  డివిజన్​ స్థాయి వైద్యులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి డీఎంవో తుకారాం రాథోడ్, డిప్యూటీ డీఎంఅండ్​హెచ్​వో రమేశ్​హాజరై మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలంలో, మలేరియా డెంగ్యూ, వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున మున్సిపల్, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి నివారణ చర్యలు ప్రారంభించాలన్నారు.

ఫ్రేడే డ్రైడే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. నివాసిత ప్రాంతాల్లోని డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్​తో పాటు, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించాలన్నారు. సమావేశంలో ఆర్మూర్ డివిజన్ మెడికల్ ఆఫీసర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.