
- డీఎంవో తుకారాం రాథోడ్
ఆర్మూర్, వెలుగు : సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని డీఎంవో తుకారాం రాథోడ్ సూచించారు. ఆర్మూర్లోని ఏరియా హాస్పిటల్లో శుక్రవారం మలేరియా, డెంగ్యూ వ్యాధుల నివారణ కోసం డివిజన్ స్థాయి వైద్యులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి డీఎంవో తుకారాం రాథోడ్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో రమేశ్హాజరై మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలంలో, మలేరియా డెంగ్యూ, వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున మున్సిపల్, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి నివారణ చర్యలు ప్రారంభించాలన్నారు.
ఫ్రేడే డ్రైడే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. నివాసిత ప్రాంతాల్లోని డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్తో పాటు, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించాలన్నారు. సమావేశంలో ఆర్మూర్ డివిజన్ మెడికల్ ఆఫీసర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.